ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. కాగా ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యుత్తమ గేమ్లను అందించిన మైదానాల సిబ్బందికి బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ సీజన్లో మొత్తం ఆరు వేదికల్లో అన్ని మ్యాచులకు మంచి పిచ్ లను తయారుచేసిన క్యూరేటర్లు మరియు గ్రౌండ్స్మెన్ లకు 1.25 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఈ మేరకు జై షా ట్వీట్ చేస్తూ, ఈ సీజన్ లో మనం కొన్ని హై ఆక్టేన్ గేమ్లను చూశాము. క్యూరేటర్లు మరియు గ్రౌండ్స్మెన్ కృషికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. వారంతా తెరపై కనిపించని నిజమైన హీరోలు, అందుకే రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీనీ ప్రకటిస్తునందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.
కాగా ఈ సీజన్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ ల్లో ముంబయి లోని వాంఖడే స్టేడియంలో 20, నావీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో 20, బ్రబౌర్న్ స్టేడియంలో 15, మరియు పూణే గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గ్రౌండ్లో 15 మ్యాచులు జరిగిన విషయం తెలిసిందే. అలాగే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులు, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలో రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీలో వాంఖడే, డివై పాటిల్, బ్రబౌర్న్, పూణే ఎంసీఏ స్టేడియాలకు రూ.25 లక్షల చొప్పున, ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాలకు రూ.12.5 లక్షల చొప్పున అందించనున్నట్టు జై షా ప్రకటించారు. ఆయా స్టేడియాల్లో సిబ్బంది ఈ నగదును అందుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF