దేశంలోని పలు రాష్ట్రాల్లో జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 22 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. తెలంగాణకు చెందిన డా.కె.లక్ష్మణ్ ను బీజేపీ అధిష్టానం ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ బరిలోకి దింపింది. కాగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు నేడే (మే 31,మంగళవారం) చివరి రోజు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కె.లక్ష్మణ్ లక్నో చేరుకుని రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. లక్నోలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
మరోవైపు ఈ రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF