దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,516 పాజిటివ్ కేసులు, 501 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,14,186 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,62,690 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మిజోరాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 13,155 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,38,14,080 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.26 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 1,37,416 (0.40%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (నవంబర్ 11 (8am)– నవంబర్ 12 (8am)):
- కేరళ – 7,224
- మహారాష్ట్ర – 997
- వెస్ట్ బెంగాల్ – 854
- తమిళనాడు – 820
- మిజోరాం – 631
- ఆంధ్రప్రదేశ్ – 286
- కర్ణాటక – 286
- ఒడిశా – 271
- అస్సాం – 251
- జమ్మూ అండ్ కశ్మీర్ – 177
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ