ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇవాంక తాజ్ మహల్ ను సందర్శించి, ఫోటోలు దిగారు. తాజాగా తాజా మహల్ వద్ద ఇవాంక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవి తను దిగినవో, తన కుటుంబంతో ఉన్నవో కాదు. తాజ్మహల్ ఎదురుగా డయానా బెంచ్పై ఇవాంకా ట్రంప్ తో కూర్చున్నట్లు ఒక ఫోటో, ఆమెను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వెళ్తున్నట్లు మరో ఫోటో మార్ఫింగ్ చేశారు. ఇలా రకరకాలగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ ఫోటోలపై మార్చ్ 1, ఆదివారం నాడు ట్విట్టర్లో ఇవాంకా ట్రంప్ స్పందించింది.
ప్రముఖ నటుడు దల్జీత్ దొసాంజా తో ఉన్న ఫోటోపై ఇవాంక స్పందిస్తూ ” అద్భుతమైన తాజ్మహల్కు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నేను ఎన్నటికీ మర్చిపోలేని అనుభవాన్ని కలిగించారని” పేర్కొన్నారు. అలాగే మరి కొన్ని ఫోటోలపై స్పందిస్తూ ”భారతీయ ప్రజల ఆప్యాయతను అభినందిస్తున్నాను. అక్కడ చాలా మంది కొత్త స్నేహితుల్ని సొంతం చేసుకున్నానని ” ఇవాంక ట్వీట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలపై సైతం తనదైన శైలిలో సరదాగా స్పందిస్తూ ఇవాంక తన ప్రత్యేకతను నిలుపుకుందని సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందిస్తున్నారు.
Thank you for taking me to the spectacular Taj Mahal, @diljitdosanjh! 😉
It was an experience I will never forget! https://t.co/VgqFuYBRIg
— Ivanka Trump (@IvankaTrump) March 1, 2020
I appreciate the warmth of the Indian people.
…I made many new friends!!! https://t.co/MXz5PkapBg
— Ivanka Trump (@IvankaTrump) March 1, 2020
[subscribe]