అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఉక్రెయిన్లో జరిగిన సంఘర్షణను రష్యా యొక్క “వ్యూహాత్మక వైఫల్యం” అని పేర్కొన్నాడు. అయితే సాధారణ రష్యన్లు మా శత్రువులు కాదు అని అన్నారు. నాటో భూభాగంలో ఒక అంగుళం కూడా కదలవద్దని రష్యాను హెచ్చరించాడు. రష్యా దండయాత్ర తర్వాత మొదటిసారిగా ఉక్రెయిన్లోని అగ్రశ్రేణి మంత్రులను కలిశారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేసిన వ్యాఖ్యను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ దీనిపై స్పందిస్తూ.. అది బిడెన్ నిర్ణయించాల్సిన అవసరం లేదు. రష్యా అధ్యక్షుడిని రష్యన్లు ఎన్నుకుంటారు అని తెలిపాడు. పాశ్చాత్య దేశాలు తమ స్టాక్ పైల్స్లో సైనిక హార్డ్వేర్లో కొంత భాగాన్ని అందించాలని ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ డిమాండ్ చేశారు.
యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్కు అదనంగా $100 మిలియన్ పౌర భద్రతా సహాయం అందించాలని భావిస్తోంది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ సహాయం అందించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, మాస్కో పూర్తి కాల్పుల విరమణకు కట్టుబడి తన దళాలను ఉపసంహరించుకుంటే ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాపై UK ఆంక్షలను ఎత్తివేయవచ్చని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ అన్నారు. రష్యా దాడి తర్వాత 3,772,599 మంది ఉక్రేనియన్లు దేశం విడిచి పారిపోయారని UN శరణార్థుల ఏజెన్సీ UNHCR తెలిపింది. కాగా, రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈశాన్య పట్టణం ట్రోస్టియానెట్స్ను తమ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ