జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేపై హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్లోని నారా నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్పై ఆయన ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు ఆయనపై వెనుక నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా షింజో అబే వేదికపై కుప్పకూలిపోయారు. ఒక్క క్షణం అక్కడేం జరిగిందో ఎవ్వరికీ అర్ధం కాలేదు. అయితే వెంటనే తేరుకున్న షింజో భద్రతా సిబ్బంది వెంటనే అత్యవసర వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని, ఎం జరిగిందో అర్ధం కాలేదని, అయితే షింజో కుప్పకూలిపోవడంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందని అర్థమైందని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టు మీడియాకు తెలిపారు. కాల్పుల్లో ఆయనకు తీవ్రగాయం అయిందని జపాన్ అధికారులు ప్రకటించారు.
మరోవైపు అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని స్థానికుడైన టెట్సుయా యమగామిగా అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపినప్పుడు అతను 10 అడుగుల దూరంలో షింజో అబే వెనుక నిలబడి ఉండటాన్ని గమనించారు. అతను ఆయుధం ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక బుల్లెట్ గాయమైన అబే పరిస్థితి విషమంగా ఉందని, ఆయనలో ఎలాంటి చలనం లేదని వైద్యులు చెప్తున్నారు. ఇక జపాన్లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన షింజో అబే, ఆగస్టు 2020లో అనారోగ్యం కారణంగా రాజీనామా ప్రకటించారు. ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగే నాటికి జపాన్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది. దేశవ్యాప్తంగా అయన పాలన పట్ల ప్రజలు సంతృప్తి ప్రదర్శించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ