మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత మూడురోజులుగా 25 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 62 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమల్లోకి తెచ్చినప్పటికీ కేసుల నమోదులో తగ్గుదల కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మార్చి 20, శనివారం నాడు ఒక్కరోజే అత్యధికంగా 27126 కరోనా కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి.
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,49,147 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 53,300 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 13,588 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 22,03,553 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 89.97 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.18 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,91,006 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 1,82,18,001 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ