దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2022 పరీక్ష షెడ్యూల్ ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండు విడతలు/సెషన్స్ లో జేఈఈ మెయిన్-2022 పరీక్ష జరగనుంది. మొదటి విడత పరీక్షలు ఏప్రిల్ 16-21 వరకు జరుగుతాయని, ఇక రెండో విడత పరీక్షలు మే 24-29 వరకు జరుగనున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ విడుదల చేసింది.
అయితే జేఈఈ మెయిన్-2022 మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తునట్టు ఎన్టీఏ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు కాకుండా ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. గత షెడ్యూల్ ప్రకారం జేఈఈ మొదటి విడత పరీక్ష కోసం ప్రకటించిన తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహణ ఉండడంతో, విద్యార్థులు నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో వారికీ మద్ధతుగా పరీక్ష తేదీల మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ