దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2022 పరీక్షలు ఈ ఏడాదికి గానూ రెండు విడతలు/సెషన్స్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించి, జూలై 11న ఫలితాలను వెల్లడించారు. కాగా రేపటి నుంచి (జూలై 21, గురువారం) నుంచి ప్రారంభమై జూలై 30 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. పరీక్షల వాయిదాకు గల కారణాలను పేర్కొనలేదు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జూలై 25 నుండి ప్రారంభమవుతాయని ఎన్టీఏ వెల్లడించింది.
జేఈఈ మెయిన్ రెండో విడతకోసం 6,29,778 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, దేశం వెలుపల ఉన్న 17 నగరాలతో సహా దేశంలోని దాదాపు 500 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జూలై 25వ తేదీన పరీక్షలు ప్రారంభించబడతాయని తెలిపారు. జూలై 21, గురువారం నుంచి https://jeemain.nta.nic.in/ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY