ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్ అయ్యాడు. ఒక వర్గం ప్రజల మనోభావాలను కించపరిచారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 2018లో చేసిన ఓ ట్వీట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు చేసి కస్టడీకి తరలించారు. నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా మహ్మద్ జుబేర్ అరెస్టుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా స్పందించింది.
Every person exposing BJP’s hate, bigotry and lies is a threat to them.
Arresting one voice of truth will only give rise to a thousand more.
Truth ALWAYS triumphs over tyranny. #DaroMat pic.twitter.com/hIUuxfvq6s
— Rahul Gandhi (@RahulGandhi) June 27, 2022
ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్లు శశిథరూర్, జైరాం రమేష్లు ఖండించారు. అలాగే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జుబేర్ అరెస్టుపై మండిపడ్డారు. ముందుగా ఎటువంటి నోటీసు లేకుండా జుబేర్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు. ఇక జుబేర్ సహోద్యోగి, ఆల్ట్ న్యూస్ మరో సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా స్పందిస్తూ.. ఓ కేసులో ప్రశ్నించేందుకు పిలిచి.. ఆయన్ని మరొక కేసులో అరెస్ట్ చేశారని ఆరోపించారు. అయితే దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. ప్రజల్లో ద్వేషభావాన్ని నింపే రీతిలో అతని ట్వీట్లు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ