తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 311 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 24, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,88,096 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన కొత్తగా ఒకరు మరణించడంతో, మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.96 శాతంకాగా, మరణాల రేటు 0.52 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,79,893 కు చేరుకుంది. ప్రస్తుతం 4,092 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. గురువారం నాడు 35,837 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,34,36,011 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,98,335 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 1,418 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ