కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 8,655 కరోనా కేసులు, 18 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,49,026 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 63,338 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 22,707 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 62,85,477 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 99,424 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 17024 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 12649, కొట్టాయంలో 10237, త్రిస్సుర్ లో 8850, కొల్లంలో 7819, ఇడుక్కిలో 7384, కోజికోడ్ లో 7052, మలప్పురంలో 6553, అలపుజాలో 5968, పతనంతిట్టలో 4387, పాలక్కాడ్ లో 3721, వాయనాడ్ లో 3430, కన్నూర్ లో 3246 కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి కేరళలో 4,54,41,438 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ