కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 8,989 కరోనా కేసులు, 25 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,16,372 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 62,377 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 24,757 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 62,08,837 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,44,384 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 24413 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 17611, కొల్లంలో 16548, కొట్టాయంలో 16270, త్రిస్సుర్ లో 11979, కోజికోడ్ లో 9292, మలప్పురంలో 8874, ఇడుక్కిలో 8840, అలపుజాలో 8168, పతనంతిట్టలో 6478, పాలక్కాడ్ లో 5240, కన్నూర్ లో 4950 కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి కేరళలో 4,52,27,779 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ