తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆయన సమాజానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. కమ్యూనిస్టు నాయకునిగా సబ్బండ వర్గాలు, పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని సీఎం అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం నిలిచిన విలువలు కలిగిన నాయకుడిగా ధర్మభిక్షం అందించిన స్ఫూర్తి నేటి తరాలకూ అనుసరణీయమని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ