కేరళ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గతకొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 82,575 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,420 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 22.30 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,65,051 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో మరో 20 మంది మరణించినట్టు తెలిపారు.
పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 168 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 153 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 61,134 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 43,286 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 60,70,170 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 2,32,980 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ