రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 167 నగరాలు మరియు పట్టణాల్లో వీకెండ్ లాక్డౌన్ను మళ్లీ పొడిగించింది. అలాగే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కూడా అమలు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31 వరకు వివాహాలు, అంత్యక్రియలు మినహా ఇతర సామూహిక కార్యక్రమాలు జరపడంపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. గవర్నమెంట్, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తాయని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడకుండా కరోనా వైరస్ తో పోరాడాల్సి ఉందని, రాష్ట్రంలో ప్రతి కరోనా మరణం తనను బాధించిందని సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆగస్టు 20 నాటికీ పంజాబ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,824 కు చేరుకుంది. వీరిలో 23,037 మంది కోలుకోని డిశ్చార్జ్ అవగా, 957 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 13,830 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
In view of rise in #Covid19 cases, we have decided to impose evening lockdown from 7 PM to 5 AM & weekends lockdown in all towns. Also no public gatherings will be allowed. Detailed instructions will be issued tomorrow. Urge all Punjabis to cooperate & triumph in #MissionFateh. pic.twitter.com/0YoMQRqx73
— Capt.Amarinder Singh (@capt_amarinder) August 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu