గతకొన్నిరోజులుగా దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్ మరియు జబల్పూర్ నగరాల్లో ఒకరోజు పాటుగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ నగరాల్లో మార్చి 20, శనివారం రాత్రి 10 నుండి మార్చి 22, సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 31 వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు.
అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే బస్సు సర్వీసులను మార్చి 20 నుంచి నిలిపివేయాలని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు మొత్తం 2,73,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,62,587 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,901 మంది మరణించారు. ప్రస్తుతం 6,609 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ