ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 19, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,366 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి శనివారం 9AM వరకు 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా 380 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక కరోనా వలన కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7189 కి పెరిగింది. గత 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,84,094 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2083 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ