కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగింస్తూ ఏప్రిల్ 20 వరకు దేశంలో లాక్డౌన్ కఠినమైన రీతిలో అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 20 తర్వాత దేశంలో వైరస్ వ్యాప్తి చెందని సురక్షిత ప్రాంతాల్లో కొంతమేర లాక్డౌన్ సడలింపు ఉండవచ్చని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పందిస్తూ ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ అమలులో కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని అన్నారు. ఏప్రిల్ 20 వరకు అన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తామని, దేశంలో 46 జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
ముందుగా కరోనా వైరస్ ను సమర్ధవంతంగా నియంత్రిస్తే ప్రజల ప్రాణాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చక్కదిద్దవచ్చని చెప్పారు. ఒక్కసారి కరోనా పాజిటివ్ వచ్చి తగ్గినప్పటికీ బాధితులు కొంతకాలం ఇళ్లలోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు, మరోవైపు ఈ అంశంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ, లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని మోదీ ప్రణాళిక సిద్ధం చేశారని, వాటిపై రేపు (ఏప్రిల్ 15, బుధవారం) నాడు కీలక ప్రకటన చేస్తారని వెల్లడించారు. దేశ ప్రజలంతా తప్పనిసరిగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ప్రకాశ్ జవదేకర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]