మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “కరోనా యొక్క తేలికపాటి లక్షణాలను కలిగి ఉండడంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. గతకొన్ని రోజులుగా నాతో సంప్రదించిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. ఈ సమయంలో కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుతున్నాను. దయచేసి కరోనా ప్రోటోకాల్లను అనుసరించండి మరియు సురక్షితంగా ఉండండి” అని ఆదిత్య థాకరే ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ