పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం

10th Class Exams with 6 Papers, AP 10 Class Exams, AP 10th Class Exam 2020, AP 10th Class Examinations, AP 10th Class Exams, AP Govt Cancels 10th Class Exams, AP Govt Cancels 10th Exams, AP SSC Exams, AP SSC Exams 2020, AP SSC Exams Updates, AP SSC Time Table 2020, AP SSC-2020 Exams, AP Tenth Class Exams, Mango News, Telangana Govt

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు 11 పేపర్లను 6 పేపర్లుగా మార్పులు చేస్తూ బుధవారం నాడు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా‌ నేపథ్యంలోనే ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆరు పేపర్ల విధానం కేవలం 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఫస్ట్‌ లాంగ్వేజ్‌(తెలుగు/హిందీ/ఉర్దూ..), సెకండ్‌ లాంగ్వేజ్‌(తెలుగు/హిందీ), ఇంగ్లీష్‌, మాథమెటిక్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టులకు ఒక్కో పేపర్ తో మొత్తం ఆరు పేపర్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పరీక్ష సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటలకు పొడిగించారు. ఆరు సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు (2 ఎఫ్ఏల సగటు) 20, వార్షిక పరీక్షలకు 80 చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్షలు జరగనున్నాయి. ఇక 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే పూర్తి షెడ్యూల్ ను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 16 =