మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 17, శుక్రవారం నాడు కొత్తగా 8308 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకేరోజు వ్యవధిలో 8 వేలకు పైగా కేసులు నమోదవడం ఇది మూడోసారి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,589 కి చేరింది. గత 24 గంటల్లో 258 కరోనా మరణాలు నమోదు అయినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 2217 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,60,357 కి చేరింది. ప్రస్తుతం 1,20,480 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో జూలై 17 నాటికీ 14,87,878 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu