మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మేఘాలయలో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మేఘాలయలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, యూడీపీ అభ్యర్థి హెచ్డిఆర్ లింగ్డో మరణంతో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహియాంగ్ నియోజకవర్గానికి పోలింగ్ వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి 27న 59 స్థానాల్లో పోలింగ్ జరిగింది. గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టగా, మొత్తం 59 స్థానాలకు గానూ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 26 స్థానాల్లో, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 5 స్థానాల్లో, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 2, హెచ్ఎస్పీడీపీ 2, పీడీఎఫ్ 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రెసిడెంట్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా 3,251 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సౌత్ తురా నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి బెర్నార్డ్ మారక్ పై కాన్రాడ్ సంగ్మా విజయం సాధించారు. 26 స్థానాలతో మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేషనల్ పీపుల్స్ పార్టీకి బీజేపీ, స్వతంత్రులు లేదా ఇతర పార్టీల మద్ధతు అవసరం కానుంది. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?, లేదా మరోకరికి అవకాశం దక్కుతుందా అనేది వేచిచూడాలి.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (59): (గెలుపు)
- ఎన్పీపీ – 26
- యూడీపీ – 11
- కాంగ్రెస్ – 5
- టీఎంసీ – 5
- వీపీపీ – 4
- బీజేపీ – 2
- పీడీఎఫ్ – 2
- హెచ్ఎస్పీడీపీ – 2
- ఇండిపెండెంట్ – 2.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE