దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ మరింత ప్రభావం చూపుతుంది. దేశంలో మార్చ్ 27 , శుక్రవారం నాటికీ 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించి, ప్రజలను ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మరింత పటిష్ఠ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/ కేంద్ర పాలిట ప్రాంతాలకు చేసిన సూచనలు:
- లాక్ డౌన్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
- విద్యార్థులు, వర్కింగ్ ఉమెన్, ఇతరులు ప్రస్తుతం వారు ఉన్నచోటే ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
- వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక, అసంఘటిత రంగ కార్మికులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం అందజేయాలి.
- ఉచిత ఆహార సరఫరాకు ప్రజా పంపిణి వ్యవస్థను వాడుకోవాలి.
- హాటళ్లు, హాస్టళ్లు, అద్దె వసతి గృహాలు కొనసాగించేలా చూడాలి.
- ప్రజలకు నిత్యావసర వస్తువులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి.