ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రముఖ వ్యక్తుల కేటగిరీలో కేరళలోని కోజికోడ్కు చెందిన పీటీ ఉష, ఏపీ నుంచి దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా, కర్ణాటక నుంచి సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేత రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, తోటి సభ్యుల సమక్షంలో పీటీ ఉష రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పీటీ ఉష హిందీ భాషలో ప్రమాణం చేశారు.
ఇక బుధవారం పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీటీ ఉషను కలిశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ పీటీ ఉష జీని పార్లమెంట్లో కలిసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు జూలై 19, మంగళవారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా పీటీ ఉష భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభకు నామినేట్ అయినందుకు పీటీ ఉషను జేపీ నడ్డా అభినందించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY