నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరయ్యే క్రమంలో రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ తీశారు. వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావడానికి ముందే ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గరే నిర్బంధించారు. ఈ ధర్నాలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా కాంగ్రెస్ నిరసనను భారతీయ జనతా పార్టీ ఖండించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు సంస్థ ముందు రాహుల్ గాంధీ హాజరుకావడానికి ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వెలుపల మరియు దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల వెలుపల భారీ పోలీసు బందోబస్తు కనిపించడంతో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సోమవారం బీజేపీపై మండిపడ్డారు. మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దీనిపై స్పందిస్తూ.. ఈ రోజు దేశంలో జరుగుతున్న దానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. హింసను సహించబోమని ప్రధాని దేశానికి సందేశం ఇవ్వాలని అన్నారు. కాగా ఈ కేసులో పార్టీ నాయకత్వానికి సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. అయితే ఈడీ కార్యాలయం ముందు సెక్షన్ 144 విధించారు. రాజధానిలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ