నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు దోషులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నలుగురు దోషులలో ఒకరైన వినయ్ కుమార్ శర్మ తీహార్ జైల్లో ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే ఈ
ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలిసింది. విచిత్రంగా ప్రవర్తిస్తూ, జైలు గోడలకు వినయ్ శర్మ తలబాదుకోవడంతో గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉరిశిక్షను అడ్డుకునేందుకు దోషులు క్షమాబిక్ష పిటిషన్లతో వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో ఉరిశిక్ష అమలు రెండు సార్లు వాయిదా పడింది. మరోసారి కూడా ఉరిశిక్షను వాయిదా వేసేలా దోషులు పలు మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా వారి చర్యల్ని బట్టి తెలుస్తుంది.
[subscribe]