“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగో రోజున మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు బొగ్గు, మినరల్స్, రక్షణ ఉత్పత్తులు, గగనతల నిర్వహణ, విమానాశ్రయాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు, స్పేస్, అటామిక్ ఎనర్జీ (అణు శక్తి) వంటి అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పీపీపీ భాగస్వామ్యంతో మరో 6 విమానాశ్రయాలను వేలానికి ఉంచుతామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే రూ.13 వేల కోట్లతో కొత్తగా మరో 12 విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. ఇకపై విమానయాన రంగంలో భారీ సంస్కరణలు ఉంటాయని తెలిపారు.
నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- బొగ్గు తవ్వకాలు, తరలింపు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ .50,000 కోట్లు కేటాయింపు.
- బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 50 బ్లాకులు అందుబాటులోకి తెస్తున్నాం.
- మినరల్స్ మైనింగ్ కు 500 బ్లాకులు సిద్ధం.
- డిఫెన్స్ రంగంలో ఎఫ్డిఐ పరిమితిని 49% నుండి 74% కి పెంచుతున్నాం. నిర్ణిత సమయంలో ఆయుధాల సరఫరాకు ఒప్పందం.
- మరో 6 విమానాశ్రయాలు వేలానికి ఉంచుతున్నాం. పీపీపీ పద్దతిలో నిర్వహణ, ప్రయివేటీకరణ.
- రూ.13 వేల కోట్లతో మరో కొత్త 12 విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు.
- విమానాశ్రయాల అభివృద్ధికి ఏఏఐ కి రూ. 2300 కోట్లు కేటాయింపు.
- రూ.1000 కోట్లతో ఎయిర్ స్పేస్ మేనేజ్ మెంట్.
- ఇండియన్ ఫ్రీ ఎయిర్ స్పేస్ నిబంధనలు సులభతరం చేయడంతో సివిల్ ఏవియేషన్ రంగానికి 1000 కోట్లు వరకు ప్రయోజనం.
- కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కంలను ప్రైవేటీకరించాలి. విద్యుత్ రాయితీలు తగ్గించుకోవాలి.
- కావాల్సినంత విద్యుత్ ను డిస్కం లు సరఫరా చేయలేక పొతే పెనాల్టీలు విధించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu