ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు ఫిబ్రవరి 12, బుధవారం నుంచి సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్కు రూ 144 నుంచి రూ.149 వరకు పెంచాయి. అన్ని మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో ఇండేన్ పేరుతో అందించే ఇండియన్ ఆయిల్ సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ.858.50, ముంబైలో రూ.829.50, చెన్నైలో రూ.881, కోల్కతాలో రూ.896కు పెరిగాయి. గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్ ధరల పెరగడం ఇది ఆరోసారి. జనవరి 1, 2020న చివరిసారిగా రూ.19 పెంచారు. గత ఆగస్టు నుండి గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ ధరలను పెంచుతునే ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా నెలవారీగా ఎల్పీజీ టాక్స్ మారుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల్లో మార్పులు కారణంగానే తాజాగా ధరల పెంచినట్టు సమాచారం. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రేట్లపై సంవత్సరానికి 12 సిలిండర్లను అందిస్తుంది. అదనపు సిలిండర్ను అవసరమైతే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని కూడా పెంచారు. గతంలో ఇచ్చిన రూ.153.86 రాయితీని రూ.291.48కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల ఇచ్చే రాయితీని రూ.174.86 నుంచి రూ.312.48కు పెంచినట్టు ప్రకటించారు.
[subscribe]