సంసద్ రత్న అవార్డులు-2023 అందుకోనున్న సహచర ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “సంసద్ రత్న అవార్డులు పొందిన ఎంపీ సహచరులకు అభినందనలు. వారు తమ గొప్ప అంతర్దృష్టితో పార్లమెంటరీ కార్యకలాపాలను సుసంపన్నం చేస్తూ ఉండాలి” అని పేర్కొన్నారు.
ముందుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేస్తూ, “2023కి సంసద్ రత్న అవార్డులు పొందినందుకు ప్రముఖ పార్లమెంటేరియన్లకు అభినందనలు. ఈ అవార్డుల 13వ ఎడిషన్ సందర్భంగా 13 మంది ఎంపీలు, 2 పార్లమెంటరీ కమిటీలు మరియు 1 జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయబడతాయి” అని తెలిపారు. అత్యుత్తమ పనితీరు కనబరిచి, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్లమెంట్ సభ్యులు చూపే చొరవకు గుర్తింపుగా ప్రతి ఏటా సంసద్ రత్న అవార్డులు అందజేస్తున్నారు. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు మొత్తం 13 మంది ఎంపీలు ఎంపిక కాగా, ఇందులో ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
Congratulations to the eminent Parliamentarians on being conferred upon Sansad Ratna Awards for 2023.
13 MPs, 2 Parliamentary Committees and 1 Lifetime Achievement honour will be awarded during the 13th edition of these awards. pic.twitter.com/8XhVPaYsYp
— Pralhad Joshi (@JoshiPralhad) February 21, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE