దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 975 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,40,947 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 4 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,21,747కి పెరిగింది. కాగా కొత్తగా నమోదైన 975 కేసుల్లో 366 కేసులు ఢిల్లీలోనే నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా ఢిల్లీలో కరోనా ప్రభావం మళ్ళీ పెరుగుతుంది.
ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి 11,366 (0.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 796 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,25,07,834 కు చేరుకుంది.
గత 24 గంటల్లో ఢిల్లీ (366), హర్యానా (174), ఉత్తర్ ప్రదేశ్ (108), మహారాష్ట్ర (69), మిజోరాం (53), కర్ణాటక (49) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఏప్రిల్ 16, శనివారం ఉదయం 7 గంటల వరకు 186.38 కోట్ల (1,86,38,31,723) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. గత 24 గంటల్లో 6,89,724 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ