దేశ వ్యాప్తంగా శనివారం శైవక్షేత్రాలు శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శివాలయాల్లో పండుగ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మహా శివరాత్రి ప్రత్యేక సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Greetings to everyone on the very special occasion of Maha Shivratri.
सभी देशवासियों को महाशिवरात्रि की अनंत शुभकामनाएं।
हर-हर महादेव!
— Narendra Modi (@narendramodi) February 18, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE