ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం న్యూ ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న భారత్ అథ్లెట్ల బృందాన్ని ప్రధాన సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమానికి అథ్లెట్లు మరియు వారి కోచ్లు హాజరయ్యారు. అలాగే కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ పాల్గొన్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్ వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజతాలు మరియు 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు కైవసం చేసుకుని, ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అథ్లెట్స్ మరియు కోచ్లను ప్రధాని మోదీ అభినందించారు. అథ్లెట్లు మరియు కోచ్లను ప్రధాని సాదరంగా స్వాగతించి, కామన్ వెల్త్ గేమ్స్ భారతదేశ అథ్లెట్ల విజయాల పట్ల అపారమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారుల అద్భుతమైన కృషి వల్ల దేశం స్ఫూర్తిదాయకమైన విజయంతో ఆజాదీ కా అమృత్ కాల్లోకి అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. గత కొన్ని వారాల్లో దేశం క్రీడారంగంలో రెండు ప్రధాన విజయాలను సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. కామన్ వెల్త్ గేమ్స్ లో చారిత్రక ప్రదర్శనతో పాటు, దేశం తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ను నిర్వహించిందన్నారు.
క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “మీరందరూ బర్మింగ్హామ్లో పోటీపడుతున్నప్పుడు, భారతదేశంలో కోట్లాది మంది భారతీయులు అర్థరాత్రి వరకు మేల్కొని, మీ గేమ్ ను చూశారు. చాలా మంది అలారాలను అమర్చుకుని నిద్రపోయేవారు, తద్వారా వారు మీ ప్రదర్శనల గురించి అప్డేట్గా ఉన్నారు. మీరు పోటీలకు వెళ్తున్నపుడు తాను చేసిన వాగ్దానం మేరకు, ఈ రోజు విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ప్రధాని అన్నారు.
అథ్లెట్ల గొప్ప ప్రదర్శనను ప్రధాని హైలైట్ చేస్తూ, సంఖ్యలు మొత్తం కష్టాన్ని, కథను ప్రతిబింబించవని వ్యాఖ్యానించారు. ఎందుకంటే సాధ్యమైనంత తక్కువ మార్జిన్ల ద్వారా చాలా పతకాలు తప్పిపోయాయని, వాటిని ఆయా ఆటగాళ్లు త్వరలో సరిచేస్తారన్నారు. గత సారితో పోలిస్తే 4 కొత్త గేమ్ల్లో భారత్ గెలుపు కొత్త మార్గాన్ని కనుగొందని అన్నారు. లాన్ బౌల్స్ నుండి అథ్లెటిక్స్ వరకు అథ్లెట్లు అద్భుతంగా ప్రదర్శన చేశారన్నారు. ఈ ప్రదర్శనతో దేశంలో కొత్త గేమ్స్ వైపు యువత మొగ్గు చాలా పెరుగుతుందని ప్రధాని అన్నారు. బాక్సింగ్, జూడో, రెజ్లింగ్లో భారతదేశపు కుమార్తెలు సాధించిన విజయాలను మరియు కామన్ వెల్త్ గేమ్స్-2022లో వారి ఆధిపత్యాన్ని కూడా ప్రధాని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తూ, అరంగేట్రం చేసిన అథ్లెట్స్ నుండి 31 పతకాలు వచ్చాయని అన్నారు.
అథ్లెట్లు దేశానికి పతకాన్ని బహుమతిగా అందించడం ద్వారా మాత్రమే కాకుండా, సంబరాలు చేసుకునేందుకు మరియు గర్వపడే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ సంకల్పాన్ని బలపరిచారని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని యువత కేవలం గేమ్స్ లోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా మెరుగ్గా రాణించేందుకు ఆటగాళ్లు స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. ఖేలో ఇండియా స్టేజ్ నుంచి బయటికి వచ్చి అంతర్జాతీయ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్-TOPS) యొక్క సానుకూల ప్రభావాన్ని ప్రధాని ప్రస్తావించారు. కొత్త టాలెంట్లను కనుగొని వారిని వేదికపైకి తీసుకెళ్లేందుకు మన ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. “ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన, ప్రతిదీ కలిగిఉంటూ, విభిన్నమైన మరియు డైనమిక్గా ఉండే స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ ను రూపొందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతిభను వదిలిపెట్టకూడదు” అని ప్రధాని నొక్కి చెప్పారు. అథ్లెట్ల విజయంలో కోచ్లు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లు మరియు సహాయక సిబ్బంది పాత్రను కూడా ప్రధాని గుర్తించారు.
రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్కు సన్నద్ధం కావాలని ప్రధాని అథ్లెట్లను కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా, గత సంవత్సరం దేశంలోని 75 పాఠశాలలు మరియు విద్యా సంస్థలను సందర్శించి పిల్లలను ప్రోత్సహించాలని క్రీడాకారులు మరియు వారి కోచ్లను ప్రధాని అభ్యర్థించారు. ‘మీట్ ది ఛాంపియన్’ క్యాంపెయిన్ కింద చాలా మంది క్రీడాకారులు ఈ పనిని చేపట్టారని, దానిని నెరవేర్చారని ప్రధాని చెప్పారు. దేశంలోని యువత క్రీడాకారులను రోల్ మోడల్గా చూస్తున్నందున ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. “మీ పెరుగుతున్న గుర్తింపు, సామర్థ్యం మరియు అంగీకారం దేశంలోని యువ తరం కోసం ఉపయోగించబడాలి” అని అన్నారు. అథ్లెట్ల విజయ్ యాత్రకు అభినందనలతో పాటుగా, వారి భవిష్యత్ ప్రయత్నాలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలుతెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY