ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా కూడా స్పందించారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జమిలి ఎన్నికలపై ఆయన స్పందిస్తూ, జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని సునీల్ అరోరా ప్రకటించారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. అయితే పార్లమెంట్ వీటిపై విస్తృతమైన సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘంకు నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని సునీల్ అరోరా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ