టైమ్ మ్యాగజైన్ 2020 సంవత్సరానికి గానూ 100 మంది అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చోటుదక్కించుకున్నారు. అలాగే షహీన్ బాగ్ ఆందోళనను నడిపించిన 82 ఏళ్ల బిల్కిస్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా కూడా స్థానం దక్కించుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక టైమ్స్ అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోదీ నాలుగో సారి స్థానం దక్కించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున ప్రజలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 రోజుల పాటు సాగిన ఈ నిరసనలో షహీన్ బాగ్ దాదీగా పేరొందిన బిల్కిస్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా టైమ్స్ జాబితాలో చోటు సంపాదించారు. మరోవైపు ఈ 100 మంది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షఅభ్యర్థిగా బరిలోకి నిలిచిన కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu