జాతీయ వేదికపై గిరిజన సంస్కృతిని ప్రదర్శించే ప్రయత్నంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 16, గురువారం) వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్”ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని గిరిజన జనాభా సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో ప్రధాని ముందంజలో ఉన్నారని, అదే సమయంలో దేశ వృద్ధి మరియు అభివృద్ధిలో వారి సహకారానికి తగిన గౌరవం ఇచ్చారని తెలిపారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోనిట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క వార్షిక చొరవ ఆది మహోత్సవ్ అని తెలిపారు. ఆది మహోత్సవ్ గిరిజన సంస్కృతి, క్రాఫ్ట్స్, వంటకాలు, వాణిజ్యం మరియు సాంప్రదాయ కళల స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు. ఈ సంవత్సరం ఆది మహోత్సవ్ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 16 నుండి 27 వరకు నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమం వేదిక వద్ద 200 స్టాల్స్లో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల గొప్ప మరియు విభిన్న వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని, ఈ మహోత్సవంలో దాదాపు 1000 మంది గిరిజన కళాకారులు పాల్గొంటారని చెప్పారు. హస్తకళలు, చేనేత, పొటరీ, ఆభరణాలు మొదలైన సాధారణ ఆకర్షణలతో పాటు, 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకుంటున్నందున గిరిజనులు పండించే శ్రీ అన్నా ని ప్రదర్శించడంపై మహోత్సవ్లో ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE