ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 25, శనివారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10:45 గంటలకు చిక్క బళ్లాపూర్లో శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు బెంగళూరు మెట్రో యొక్క వైట్ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
చిక్కబళ్లాపూర్ ప్రాంతంలో విద్యార్థులు కొత్త అవకాశాలను పొందేందుకు, అందుబాటులో ఉండే మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడే ఒక చొరవలో భాగంగా శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ని ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. ఇది శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారిచే సత్యసాయి గ్రామం, ముద్దెనహళ్లి, చిక్కబళ్లాపూర్లో స్థాపించబడింది. గ్రామీణ ప్రాంతంలో నెలకొని ఉండి, వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణను డి కమర్షలైజేషన్ చేసే దృక్పథంతో స్థాపించబడిన ఈ ఇన్స్టిట్యూట్ వైద్య విద్య, నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తిగా ఉచితంగా అందరికీ అందిస్తుందని చెప్పారు. 2023 విద్యా సంవత్సరం నుండి ఇన్స్టిట్యూట్ పనిచేయడం ప్రారంభమవుతుందని తెలిపారు
ఇక దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి అర్బన్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని, దీనికి అనుగుణంగా బెంగళూరు మెట్రో ఫేజ్ 2 కింద వైట్ఫీల్డ్ (కడుగోడి) మెట్రో నుంచి కృష్ణరాజపుర మెట్రో లైన్ ఆఫ్ రీచ్-1 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ వరకు 13.71 కి.మీ.ని వైట్ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేషన్లో ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. సుమారు 4250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ మెట్రో లైన్ ప్రారంభోత్సవం బెంగళూరులోని ప్రయాణికులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుందని మరియు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE