తమిళనాడు రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో పార్టీలో సీఎం అభ్యర్థిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 7 వ తేదీన సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఇటీవలే అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం జరిగిన సమావేశంలో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు.
ముందుగా అన్నాడీఎంకే పార్టీలో సీఎం అభ్యర్థిత్వం కోసం ప్రస్తుత సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య పోటీ నెలకొనడంతో పార్టీలో సంక్షోభ పరిస్థితులకు దారితీసింది. కీలక అన్నాడీఎంకే పార్టీలో ఇరువర్గాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడంతో తమిళనాడులో ఉత్కంఠ నెలకుంది. అయితే పార్టీలోని ఇతర కీలక నాయకులు పన్నీర్ సెల్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలనుంచి తీవ్రపోటీ నెలకొన్న నేపథ్యంలో పార్టీ విజయమే లక్ష్యంగా వారిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu