ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20, శనివారం ఉదయం నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరిగింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, దేశ ఉత్పత్తి సామర్ధ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సేవలు, పోషణ అందించడం సహా పలు అంశాలను ఎజెడాగా పెట్టుకుని చర్చించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్ సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ అనేది మన సొంత అవసరాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా ఉత్పత్తి చేసే భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసి ఒక సరైన నిర్దిష్ట దిశలో పయనిస్తూ, మరింత అర్ధవంతంగా ఉండడమే దేశ అభివృద్ధికి పునాదిగా మారుతుందని చెప్పారు. దేశం సమయాన్ని వృధా చేయకుండా వేగవంతగా ముందుకు సాగడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఈ మార్పులో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ