పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముందుగా కుంటా శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడుగా కుంటా శ్రీనును, ఏ2గా శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్ ను చేర్చినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. కాగా ఈ ముగ్గురుకి కరోనా పరీక్షలు నిర్వహించి, శుక్రవారం రాత్రి మంథనిలోని జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు.
ఈ సందర్భంగా వారికీ 14 రోజుల పాటుగా రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసులో వాహనం, కత్తులు సమకూర్చాడనే అభియోగాలతో బిట్టు శ్రీను అనే వ్యక్తిని కూడా శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ