భారత దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న దేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “”జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మేజర్ ధ్యాన్ చంద్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. ఇటీవలి సంవత్సరాలు క్రీడలకు గొప్పగా మారాయి. ఈ ట్రెండ్ కొనసాగుతుంది. క్రీడలను భారతదేశం అంతటా ఆదరణ పొందుతూనే ఉండనివ్వండి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు గత ఏడాది దేశంలో క్రీడలకు సంబంధించి ఆటగాళ్లకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY