ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ దేశంలో పర్యటన ముగించుకుని బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే బుధవారం ఉదయం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ భేటీ నిర్వహించారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, నరేందర్ సింగ్ తోమర్, ఎస్.జయశంకర్, స్మృతీ ఇరానీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 7వ పే కమీషన్ ఫిట్మెంట్ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి కూడా ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF