అక్టోబ‌ర్ 21న కేదార్‌నాథ్, బ‌ద్రీనాథ్ ఆలయాలను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi to Visit Kedarnath and Badrinath on October 21st, PM Narendra Modi, Narendra Modi to Visit Kedarnath, Narendra Modi to Visit Badrinath, PM Narendra Modi Kedarnath Tour on October 21st, Mango News, Mango News Telugu, PM Narendra Modi Badrinath Tour on October 21st, Badrinath Piligrim, Kedarnath Piligrim, PM Narendra Modi Latest News And Updates, PM Narendra Modi Kedarnath and Badrinath on Tour, Narendra Modi Kedarnath Tour News And Live Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 21, శుక్రవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో పర్యటించి, కేదార్‌నాథ్, బ‌ద్రీనాథ్ ఆలయాలను సంద‌ర్శించ‌నున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆదిగురువు శంకరాచార్య సమాధి స్థలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9.25 గంటలకు మందాకిని అస్తపథం మరియు సరస్వతీ అస్థపథంతో పాటు ఇతర అభివృద్ధి పనుల పురోగతిని ప్రధాని మోదీ సమీక్షించనున్నారు.

ఆ తర్వాత ప్రధాని బద్రీనాథ్ కు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించి, పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, 12.30 గంటలకు మన అనే గ్రామంలో రోడ్డు, రోప్‌వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అరైవల్ ప్లాజా, సరస్సుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే ఈ పర్యటనలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన రోడ్ల విస్తరణ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + thirteen =