ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా బదిలీపై ఏపీ ట్రాన్స్పోర్ట్స్, రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.తిరుమల కృష్ణ బాబును బాధ్యతల నుండి రిలీవ్ చేశారు. ఐఏఎస్ అధికారి వీరపాండియన్ ను పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది.
అలాగే వీరపాండియన్ కు మార్క్ఫెడ్ జేఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) (ఎఫ్ఏసీ) ముత్యాల రాజు రేవు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY