ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క ఎనిమిదో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9.5 కోట్లమందికిపైగా రైతులకు రూ.19 వేల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 14, శుక్రవారం నాడు విడుదల చేయనున్నారు. ఈ నిధుల విడుదల కార్యక్రమం అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారు రైతులతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. ప్రధాని మోదీతో పాటుగా ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు.
ముందుగా దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద ఎనిమిదో విడత రూ.2000 సాయాన్ని నేడు రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 1.15 లక్షల కోట్లకు పైగా నిధులను రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ