ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆమె అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమితం కుటుంబ సభ్యులు వెంటనే అహ్మదాబాద్ లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో ప్రధాని మోదీ వెంటనే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు చేరుకున్నారు. హీరాబెన్ మోదీ స్వస్థలం గుజరాత్ లోని మెహసానాలోని వాద్నగర్. ఆమెకు ప్రధాని మోదీ సహా మరో నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గాంధీనగర్ లోని రైసన్ ప్రాంతంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి హీరాబెన్ నివసించారు.
ఈ ఏడాది జూన్ 18న హీరాబెన్ మోదీకి 100 ఏళ్లు నిండాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా వాద్నగర్లోని హత్కేశ్వర్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన షెడ్యూల్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికి వీలుకుదిరినప్పుడల్లా ప్రధాని మోదీ గుజరాత్ కు వెళ్లి తల్లిని కలుసుకునేవారు. డిసెంబర్ 4న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ మరియు చివరి దశకు ముందు గాంధీనగర్లో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీని కలిశారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE