సిక్కిం రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “సిక్కింలోని నా సోదరీమణులు మరియు సోదరులకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సిక్కిం ప్రజలు విభిన్న రంగాలలో తమను తాము గుర్తించుకుని మరియు దేశ ప్రగతికి గొప్ప కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా మరియు మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించబడాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సిక్కిం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు శుభాకాంక్షలు. సేంద్రీయ వ్యవసాయం మరియు స్థిరమైన అభివృద్ధి మార్గాన్ని అవలంబించడంలో సిక్కిం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు ఒక ఉదాహరణగా నిలిచింది. నిరంతర వృద్ధి మరియు శ్రేయస్సు కోసం సిక్కిం ప్రజలందరికీ నా శుభాకాంక్షలు” అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF