ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గానూ కేంద్ర ప్రాయోజిత పథకం అయిన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” (వీవీపీ)కి రూ.4800 కోట్ల ఆర్థిక కేటాయింపులతో కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ఈ పథకం ద్వారా దేశంలోని ఉత్తర సరిహద్దులోని బ్లాకుల్లో గల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని వారి స్థానిక స్థానాల్లో ఉండేలా ప్రజలను ప్రోత్సహించడంలో పాటుగా, ఆ గ్రామాల నుండి వలసలను తిప్పికొట్టడంతోపాటు సరిహద్దు భద్రతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందన్నారు. దేశంలోని ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న 4 రాష్ట్రాలు మరియు 1 యూటీలోని 19 జిల్లాలు మరియు 46 బోర్డర్ బ్లాక్లలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన కోసం ఈ పథకం నిధులను అందిస్తుందని, మొదటి దశలో 663 గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:
- వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సహకారం కోసం భారత్ మరియు చిలీల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదం.
- దేశంలో సహకార మూవ్ మెంట్ బలోపేతం చేయడానికి మరియు అట్టడుగు స్థాయి వరకు దాని విస్తృతిని పెంచడానికి కేబినెట్ ఆమోదించింది. ఇంకా కవర్ చేయని పంచాయతీలో ఆచరణీయమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఏర్పాటు చేయడం, కవర్ కానీ ప్రతి పంచాయతీ/గ్రామంలో ఆచరణీయమైన పాల సహకార సంఘాలు ఏర్పాటు, ప్రతి తీరప్రాంత పంచాయతీ/గ్రామంలో, అలాగే పెద్ద నీటి వనరులు ఉన్న పంచాయతీ/గ్రామంలో ఆచరణీయమైన మత్స్య సహకార సంఘాలు మరియు ప్రస్తుతం ఉన్నపీఏసీలు/పాడి పరిశ్రమ/మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళార్ధసాధక పీఏసీలు/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను స్థాపించడం ప్రారంభ లక్ష్యమని పేర్కొన్నారు.
- డిజేబిలిటీ రంగంలో సహకారం కోసం భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదం.
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరియు ఇంగ్లాండ్ అండ్ వేల్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఈడబ్ల్యూ) మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE