పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనంతరం మార్చి 16న పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ అవినీతిని నిరోధించే విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న షాహీద్ దివస్ (భగత్ సింగ్ వర్ధంతి) సందర్భంగా అవినీతి నిరోధక హెల్ప్లైన్ నంబర్ లను జారీ చేస్తామని ప్రకటించారు. అది తన పర్సనల్ వాట్సాప్ నంబర్ అవుతుందని, ఎవరైనా లంచం అడిగితే, అందుకు సంబంధించిన వీడియో/ఆడియో రికార్డింగ్ని ప్రజలు తనకు పంపించాలని సూచించారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పంజాబ్లో ఇకపై అవినీతి ఉండదని అన్నారు. ఈ మేరకు గురువారం నాడు సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అవినీతి విషయంలో భగవంత్ మాన్ చేసిన ప్రకటనపై పెద్దఎత్తున చర్చ జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ