తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కరీంనగర్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని మార్క్ఫెడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. సంజయ్ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారని, ముందు మంత్రి గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని బండి సంజయ్కు సవాల్ విసిరారు. బండి సంజయ్ కరీంనగర్ పట్టణంలో ఏమైనా అభివృద్ధి సాధించారా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసింది ఏంటి? తెలంగాణ దాహార్తిని తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం సంజయ్ ఏమైనా ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా దీనిపై కేంద్రాన్ని నిలదీశారా అని అడిగారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కనీసం పార్లమెంట్లో కూడా ప్రస్తావించలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఒక మెడికల్ కాలేజీ లేదు, ట్రిపుల్ ఐటీ లేదు, ఒక ఐఐటీ రాలేదు, కనీసం పాలిటెక్నిక్ కాలేజీ కూడా తేలేదు. చివరికి కరీంనగర్ కి ఒక గుడి కూడా తీసుకురాలేదని బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ